ఈ లక్ష మందికి డబ్బులివ్వలేదు, చీప్ లిక్కర్లు ఇవ్వలేదు, ఏ లారీలు పెట్టి తోలలేదు. పనులు మానేశారు,చదువులకు స్వస్తి పలికారు, ఎంసెట్ కౌన్సిలింగ్ అక్కర్లేదన్నారు. మరి వీరందరిని ఈక్కడికి నడిపిన బంధమేమిటి? మద్రాసు ను పోగొట్టుకున్నాం, కుర్నూలును పొగొట్టుకున్నాం,హైదరబాదును కూడా పోగొట్టుకుంటున్నాం అన్న భయమేమో... తెలుగువాడి ప్రతిభను ప్రపంచానికి చాటాలన్న దూరదృష్టి లేకుండా తమచుట్టూ గిరిగీసుకుని పబ్బం గడుపుకునే పనికిమాలిన రాజకీయాలకు బలైపోతున్నమనే భయమా... అవును ఖచ్చితంగా ఇదే. ఒక్క కర్నూలు లోనే ఇంతమంది నిరసనలు తెలిపితే రాష్ట్రం మొత్తం నెక్లెస్ రోడ్డుకు చేరితే అది సరిపోతుందంటారా... 22వ తేదీన కర్నూలు లో జరిగిన లక్ష గళ ఘోష దృశ్యాలివి. ఇక్కడ చేరింది నగరం లోని జనాలు మాత్రమే. మారు మూల పల్లెల్లో కూడా సమైఖ్య ఉద్యమం రగులుతోంది. కన్నీళ్ళతో సేద్యం చేసి కుర్నూలుసోనా సన్న బియ్యం ప్రపంచానికి అందించాము. ఆ బియ్యం పండించడానికి నీళ్ళు దొరకవని భయం. త్రాగడానికి నీరు దొరకని వీరు ప్రపంచానికి సన్న బియ్యాన్ని అందించారు. వీరికి తెలంగాణాను దోచుకోవాల్సిన అవసరం వుందంటారా...పాలమూరు వలస కూలీలకు అన్నం పెట్టిన వీళ్ళు వాళ్ళను దోచుకుంటారా? కుహనా తెలంగాణ వాదులారా ఒక్కసారి స్వార్థం వీడి వాస్తవాలు చూడండి. కృష్ణా జలాలు మొత్తం మీవేనా వాటి పై మాకేమీ హక్కు లేదా? బ్రాహ్మడి చేతిలోని మేకను లాక్కోవడానికి కుక్క కుక్క అన్న దొంగల సంగతి మరచిపోకండి. కుహనా తెలంగాణ వాదుల మాటలకు మోసపోకండి.
22, ఆగస్టు 2013, గురువారం
పాలమూరు కూలీలకు అన్నం పెట్టాము మేము దొంగలమా???
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)




కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి